by సూర్య | Thu, Nov 18, 2021, 03:19 PM
ప్రపంచ దేశాలకు తాలిబన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమకు రావాల్సిన 9 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయాలని చెప్పారు. లేనిపక్షంలో ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలసలు పెరుగుతాయని... ఆ వలసలతో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. తాలిబన్లు ఆప్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా స్తంభింపజేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం నిధులు లేక అల్లాడిపోతోంది. ఆప్ఘనిస్థాన్ లో ఆహార సమస్య కూడా పెరుగుతోంది. శీతాకాలంలో ఆహార సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కావున తాలిబన్లు మాట్లాడుతూ తమ సెంట్రల్ నిధులను, ఆస్తులను అమెరికా స్తంభింపజేయడం అమానుషం అని ఇక తరువాత ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుoదని లు హెచ్చరిoచింది.
Latest News