తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం

by సూర్య | Thu, Nov 18, 2021, 11:51 AM

తెలుగు రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ అనురాధ ఇంట్లో సోదాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న కళ్యాణ్ రావు ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. మరోవైపు విశాఖపట్నంలోని అనురాధ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఇటీవలి కాలంలో తాజాగా మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాన్ని ప్రచురించే అంశాన్ని ఎన్ఐఏ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన రవిశర్మ ఇటీవల లొంగిపోయారు. ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

Latest News

 
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM