by సూర్య | Thu, Nov 18, 2021, 11:01 AM
భారత్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 11,919 మందికి పాజిటివ్గా తేలింది. అదే సమయంలో, 11,242 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 470 మంది కరోనా కారణంగా మరణించారు. ఈ మరణాలలో 388 కేరళలో సంభవించాయి. దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,64,623కి పెరిగింది. మొత్తం 3.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,28,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. నిన్న 73.4 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు దాదాపు 114 కోట్ల డోస్ల వ్యాక్సిన్ వేశారు.
Latest News