by సూర్య | Wed, Nov 17, 2021, 11:03 PM
భారతదేశంలోని జైపూర్లో నవంబర్ 17, 2021న సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య T20 అంతర్జాతీయ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ తొలి వికెట్కు 50 పరుగులు జోడించారు.రాహుల్ ఔటైన అనంతరం రోహిత్ శర్మ(48), సూర్యకుమార్ యాదవ్ (63) టీమిండియా ఇన్నింగ్స్ తీసుకువెళ్లారు. చివరి ఓవర్ నాలుగో బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయాన్నిసాధించింది . న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, సౌథీ, సాంట్నర్, మిచెల్ తలా ఒక వికెట్ తీశారు.రోహిత్ శర్మ(48) బౌల్ట్ బౌలింగ్లో వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
Latest News