by సూర్య | Wed, Nov 17, 2021, 09:42 PM
భోపాల్ లో టీ20 సిరీస్ జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియా ముందు 165 పరుగుల విజయలక్ష్యాన్ని పెటింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లలో మార్టిన్ గుప్టిల్ 70 పరుగులు, మార్క్ చాప్ మన్ 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీస్కున్నారు , దీపక్ చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ లో దిగిన భారత జట్టు నిలకడగా ఆడుతున్నారు . ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఆడుతున్నారు. వీరిద్దరూ 4.5 ఓవర్లలో 50 పరుగుల చేసారు . రోహిత్ శర్మ 16 బంతుల్లో 31 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 13 బంతుల్లో 15 రన్స్ చేశాడు.
Latest News