by సూర్య | Wed, Nov 17, 2021, 09:32 PM
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ధ్వజం కట్టారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు . ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి ప్రతిరూపాం అని అయన తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ పతనం మొదలైంది అని చెప్పారు . చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ముగింపు పడిందని తెలిపారు .ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అర్హత చంద్రబాబుకి లేదు అని అన్నారు. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన చంద్రబాబుకు దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలు గురుంచి మాట్లాడే అర్హత లేదు తెలిపారు.చంద్రబాబు హైదరాబాదులోనే ఉండిపోవాలని ఆయనకు ఆంధ్రాప్రదేశ్ కి వచ్చే అర్హత కూడా లేదు అని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలనను ప్రజలు అర్థం చేసుకున్నారని, వైసీపీని ఆశీర్వదించారని తెలిపారు.
Latest News