by సూర్య | Wed, Nov 17, 2021, 05:57 PM
కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేటలో హై టెన్సషన్ వాతావరణం కొనసాగుతోంది. మరోసారి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పోలీసులు, పోలింగ్ సిబ్బందిని ఉండగానే కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. తొలుత 13వ వార్డులో 5 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. నాలుగు సార్లు రీ కౌంటింగ్ అనంతరం వైసీపీ గెలిచిందని ప్రకటించారు. పొటా... పోటీగా టీడీపీ వర్సస్ వైకాపా పార్టీలు పోటీపడుతున్నాయి. కొన్నిచోట్ల రి కౌంటింగ్ నిర్వహించారు. వైసీపీ నేతలు అలజడి సృష్టించేందుకు సిద్ధపడుతున్నారు అని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులోభాగంగానే జగయ్యపేటకు పోలీసు అదనపు బలగాల తరలించారు. జగయ్యపేటలో స్వయంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్చంద్ మానిటరింగ్ చేస్తున్నారు.
Latest News