by సూర్య | Wed, Nov 17, 2021, 03:09 PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ విజయకేతనం ఎగురవేసిoది. చంద్రబాబు కుప్పంలో ఇలాఖగా చెపుకోవచ్చు కానీ అక్కడ ఈ సారి వైసీపీ విజయం సాధించింది టీడీపీ షాక్ ఇచ్చింది. అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 24 వార్డులకు గాను వైసీపీ 19, టీడీపీ 5 వార్డులు గెలుచుకున్నాయి. మరికొన్ని వార్డుల్లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక నెల్లూరు కార్పొరేషన్ తోపాటు ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసిపి జయకేతనం ఎగురవేసింది. ఎన్నిక;లపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఇక అసలు ఎన్నికలంటేనే దూరంగా పారిపోయే స్థితికి చంద్రబాబు, టీడీపీ, దిగజారిందని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలే టీడీపీ పతనానికి ఆఖరి చరణం అని, కుప్పం మున్సిపాలిటీలోనూ టీడీపీ పరాజయం తర్వాత చంద్రబాబుకు రాసుకోడానికి చరిత్ర, చూసుకోడానికి భవిష్యత్తు కూడా లేదని వైసీపీ రోజా ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించిన కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే ఆర్కే రోజా.
Latest News