మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా సౌరవ్ గంగూలీకి ప్రమోషన్..

by సూర్య | Wed, Nov 17, 2021, 02:56 PM

ఐసీసీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి  ప్రమోషన్ ఖరారు చేసింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ ఎన్నికైనారు. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మరో భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకమయ్యారు. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లలో పకడ్బందీగా డీఆర్ఎస్ అమలు, అనుమానిత బౌలింగ్ యాక్షన్ ను గుర్తించేందుకు అధునాతన ప్రక్రియలకు అనిల్ కుంబ్లే శ్రీకారం చుట్టారని కొనియాడారు. అంతేగాకుండా మహిళా క్రికెట్ లోనూ ఫస్ట్ క్లాస్ స్టేటస్, లిస్ట్ ఏ క్లాసిఫికేషన్ కు ఐసీసీ ఆమోదం తెలిపింది. మహిళా క్రికెట్ కు సంబంధించి కూడా ఐసీసీ విమెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇంకా మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీకి స్వాగతo పలికిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే  క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సౌరవ్ గంగూలీ అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM