నెల్లూరులో వార్‌ వన్‌ సైడ్.. వైసిపి విజయకేతనం..

by సూర్య | Wed, Nov 17, 2021, 02:47 PM

ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. దానితో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి…  నెల్లూరు కార్పొరేషన్ లోనూ మెజారిటీ స్థానాలను గెలిచి.. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 54 వార్డులకుగానూ 8 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 46 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 52 వార్డులు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం కావడం లాంఛనమే అయింది. ఇక మరోవైపు అధికార పార్టీ 9 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM