by సూర్య | Wed, Nov 17, 2021, 10:16 AM
కొవ్వూరు పురపాలక సంఘం 23 వ వార్డు కి జరిగిన ఉప ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ పేర్కొన్నారు.మురుగొండ రమాదేవి, టిడిపి ..(సైకిల్ గుర్తు) అభ్యర్థి కి 828 ఓట్లు పడగా, తన సమీప అభ్యర్థి పై 729 ఓట్లు ఆధిక్యం తో గెలుపొందారు. ఇక్కడ వై ఎస్ ఆర్ సిపి తన పార్టీ తరపున అభ్యర్థి ని నిలపలేదు.కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని రవికుమార్ తెలిపారు.దీప్తి స్కూల్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ను నిర్వహించారు. అడ్డురి సత్యనారాయణ , బీజేపీ . (కమలం గుర్తు) కి 99 ఓట్లు, అశోక్ కుమార్ దగ్గు, సీపీఐ(ఎమ్) (సుత్తి కొడవలి గుర్తు) ఆరు ఓట్లు; .మురుగొండ రమాదేవి, టిడిపి ..(సైకిల్ గుర్తు) 828 ఓట్లు ; రుద్రం వీరబాబు, స్వతంత్ర అభ్యర్థి .. (బీరువా గుర్తు) ఒక ఓటు వొచ్చాయి.
Latest News