by సూర్య | Wed, Nov 17, 2021, 09:10 AM
కేరళను టెన్షన్ పెడుతున్న నోరో వైరస్’. కేరళలో మరో కొత్త వైరస్ బయటపడింది. ‘నోరో వైరస్’ అనే ఈ వ్యాధిని వయనాడ్ జిల్లాలోని ఓ పశువైద్య కళాశాల చెందిన 13 మంది విద్యార్థుల్లో రెండు వారాల కిందట గుర్తించారు. వాంతులు, విరేచనాలకు కారణమయ్యే ఈ ‘నోరో వైరస్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. విద్యార్థుల రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ)కి పంపించింది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. వైరస్ వివరాలు తెలుసుకొని వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి వనరులను ఇప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Latest News