by సూర్య | Wed, Nov 17, 2021, 08:38 AM
పశ్చిమగోదావరి: దేవరపల్లి గ్రామానికి చెందిన కొండా మధుసూదన్ (60) గత రెండు నెలలుగా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. విద్యుత్ మీటర్ రీడింగులను తీసుకోవాలని సిబ్బంది మంగళవారం ఆ ఇంటి తలుపులు తెరిచారు. మధుసూదన్ ఇంట్లో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాలుగైదు రోజుల క్రితమే శరీరం వాచిపోయి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Latest News