by సూర్య | Wed, Nov 17, 2021, 12:00 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబరు 18 నాటికి దక్షిణ కోస్తా - ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంగా చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెపింది.కోస్తాంధ్ర - తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో మరింతగా బలపడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 18, 19 తేదీల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశలు ఉన్నాయి.అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది . సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు ఆని తెలిపింది.
Latest News