by సూర్య | Tue, Nov 16, 2021, 08:31 PM
ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హిండాల్కో కంపెనీలు నష్టపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది . ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోయి 60,322కి పడిపోయింది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 17,999కి దిగజారింది. ఆటోమొబైల్స్ సూచీ రెండున్నర శాతం వరకు బాగా నష్టపోయింది.
Latest News