by సూర్య | Tue, Nov 16, 2021, 05:57 PM
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశoలో కనీసం 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని టీడీఎల్పీ డిమాండ్ చేసింది. అలాగే అమరావతి రైతుల మహాపాదయాత్రకు టీడీఎల్పీ సంఘీభావం తెలిపింది. చట్టసభలను వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు చేస్తోందని టీడీఎల్పీ పేర్కొంది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందన్నారు. పెట్రో ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించకపోవడాన్ని టీడీఎల్పీ తప్పుపట్టింది. సీపీఎస్ రద్దు చేస్తామని రెండున్నరేళ్లైనా రద్దు చేయలేదని తెలిపింది. ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై భారం వేయడాన్ని టీడీఎల్పీ ఖండించింది. ఈ టీడీఎల్పీ సమావేశoలో తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Latest News