రేపే భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్

by సూర్య | Tue, Nov 16, 2021, 04:54 PM

ఈ నెల 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సన్నాహాలు షురూ చేశారు. ఇక  కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికలో తొలి టీ20 సిరీస్ కు సిద్ధమైనది టీమిండియా. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తో కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్ గా ద్రావిడ్ నియమితుడయ్యాడు. దానితో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగాడు.  ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ జరగనుండగా, టీమిండియా ఆటగాళ్లతో ద్రావిడ్ సాధన చేయించాడు. నూతన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కాంబినేషన్ లో టీమిండియా కొత్త ప్రస్థానం ప్రారంభిస్తోంది.  ద్రావిడ్ సమక్షంలో భారత క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, ద్రావిడ్ స్వయంగా త్రోడౌన్లు విసిరి సహకరించాడు.

Latest News

 
టీడీపీ తీర్థం పుచ్చుకున్న మల్లెల రాజేష్ నాయుడు, కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:25 PM
ఆలయంలో దొంగల బీభత్సం Fri, Mar 29, 2024, 08:22 PM
ఏపీలో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరికొన్ని రైళ్లు పొడిగింపు, పూర్తి వివరాలివే Fri, Mar 29, 2024, 08:11 PM
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM