by సూర్య | Wed, Oct 27, 2021, 10:45 AM
తెలుగుదేశంనేత ధూళిపాళ్ల నరేంద్ర కు మరో బిగ్ షాక్ తగిలింది. ధూళిపాళ్ల నరేంద్రపై తాజాగా ఏపీ ప్రభుత్వం మరో అస్త్రం వదిలింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది సర్కార్. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ప్రభుత్వం తరఫున నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు కమిషనర్ హరి జవహర్ లాల్. రెండు రోజుల్లోనే దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో దేవాదాయ శాఖ పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. కాగా. ప్రస్తుతం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు ద్వారా డివిసి ఆసుపత్రి నడుస్తోంది.
Latest News