రైతులకు గుడ్ న్యూస్..

by సూర్య | Wed, Oct 27, 2021, 09:15 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఇచ్చిన హామీల్లో వందశాతం నెరవేర్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ మంగళవారం విడుదల చేశారు. వరుసగా మూడో ఏడాది రెండో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి 50.37 లక్షల మంది రైతులకు రూ.2,051.71 కోట్లు నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద 2020 ఖరీఫ్‌లో రుణాలు తీసుకున్న 6.67 లక్షల రైతులకు రూ.112.7 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద రాష్ట్రంలోని 1720 రైతు సంఘాలకు వ్యవసాయ పరికరాల కొనుగోలు కోసం రూ.25.55 కోట్ల రాయితీ నిధులు సీఎం విడుదల చేశారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM