చెరువులో పడి యువకుడి మృతి

by సూర్య | Wed, Oct 27, 2021, 08:41 AM


కాలకృత్యాలకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందాడు. కోరంగి పోలీసుల కథనం ప్రకారం. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి పసుపులేటి వీర బాబు గాడిమొగ గ్రామంలో తాపీ పని చేసేందుకు ఐదుగురు యువకుల్ని తీసుకువచ్చాడు. వీరిలో ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామానికి చెందిన నామాల లోవదుర్గ (19) కూడా ఉన్నాడు. వారు నెల రోజులుగా ఇక్కడ పని చేస్తున్నారు. పని ముగిసిన అనంతరం మంగళవారం స్థానిక మంచినీటి చెరువు వద్దకు కాలకృత్యాలకని లోవదుర్గ వెళ్లాడు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. అతడి కోసం గాలించగా చెరువులో మృతదేహం లభ్యమైంది. కోరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News

 
దివ్యాంగుల చేయూతకు ఎన్నికల సంఘం ‘సాక్ష్యం’ యాప్ Thu, Apr 25, 2024, 06:51 PM
ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’ Thu, Apr 25, 2024, 06:46 PM
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎన్నికలు నిర్వహించండి Thu, Apr 25, 2024, 06:45 PM
వైసీపీ బీజేపీతో అంటకాగుతుంది Thu, Apr 25, 2024, 06:45 PM
రాష్ట్రానికి టీడీపీ అవసరం ఎంతైనా ఉంది Thu, Apr 25, 2024, 06:44 PM