ఐఏఎస్‌లను ఆదర్శంగా తీసుకోవాలి : సీఎం జగన్

by సూర్య | Tue, Oct 26, 2021, 06:01 PM

ఏపీ రాష్ట్రంలోని ఐఏఎస్‌లను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ ఎస్టీ, ఎస్సీ గురుకులాల్లో చదివి ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందిన ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందనలు తెలిపారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను సీఎం జగన్ బహూకరించారు. ఐఏఎస్‌లుగా ఉన్న చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవేనని ఆయన అన్నారు. వారు కష్టపడి ఐఏఎస్‌ సాధించారన్నారు. వారి నుంచి కూడా స్ఫూర్తి పొంది కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు జగన్ సూచించారు. విద్యార్థులకు ఏం కావాలన్నా తగిన సహాయ సహకారాలు అందుతాయని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM