ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!

by సూర్య | Tue, Oct 26, 2021, 02:26 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరహారం చెల్లింపుపై ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లింపు గురించి ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిహారాన్ని విపత్తు నిర్వహణ నిధి నుండి బాధిత కుటుంబాలకు చెల్లించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆరోగ్యశాఖ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది.


ఇందుకు డీఆర్‌వో నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా బాధిత కుటుంబాలకు రెండు వారాల్లో పరిహారం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతుల కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్‌లు స్వీకరించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించనున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM