48 గంటల్లో అల్పపీడనంగా మారే చాన్స్‌

by సూర్య | Tue, Oct 26, 2021, 02:10 PM

బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది.

Latest News

 
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు Fri, Mar 29, 2024, 11:59 AM
నేడు ఆ జోన్ లో పలు రైళ్లు రద్దు Fri, Mar 29, 2024, 11:58 AM
నేడు టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం Fri, Mar 29, 2024, 11:57 AM
రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే కలిశాము Fri, Mar 29, 2024, 11:43 AM
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM