క్రికెట్ బెట్టింగ్ పై పోలీసుల దాడి
by సూర్య |
Tue, Oct 26, 2021, 12:21 PM
కొవ్వూరులోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నాయని మండల పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ తన సిబ్బందితో ఆ ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను, రూ. 16 వేల నగదు, రెండు చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనక ఎవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు మంగళవారం తెలిపారు. అటు యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని సూచించారు.
Latest News