by సూర్య | Tue, Oct 26, 2021, 10:29 AM
కడప : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు...ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సోము వీర్రాజు. రాయచోటి లో ఇసుక మాఫియా చేస్తున్న చీఫ్ విప్ బీజేపీ పై విమర్శలా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాత్రి పగలు అని తేడా లేకుండా జేసీబీ లు, ప్రొక్లైన్ లతో ఇసుక అమ్ముకుంటున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు కేంద్ర బలగాలను కేటాయించారని పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు... కేంద్ర ఎన్నికల సంఘ నిర్ణయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు... బద్వేలు నియోజక వర్గం భూ ఆక్రమణలు జరిగిన బాధితులకు అండగా ఉంటామని తెలియ జేశారు సోము వీర్రాజు. భూ ఆక్రమణలు జరిగిన వారందరికీ తిరిగి వారి భూముల ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. బద్వేలు నీటి సమస్యను పరిష్కారం చేస్తామని... బద్వేలులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సోము వీర్రాజు..
ప్రత్యేక అభివృద్ధి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంతమని... ఆంధ్ర ప్ర దేశ్ రా ష్ట్రం లో వేల కోట్ల నిధులు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు సోము వీర్రాజు.. అభివృద్దే లక్ష్యంగా బీజేపీ పార్టీ పని చేస్తుందన్నారు.. బద్వేలు అభివృ ద్ధి పై దమ్ముంటే బీజేపీ అభ్యర్థి తో చర్చకు శ్రీకాంత్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు సోము వీర్రాజు. చీఫ్ విప్ ఆధ్వర్యంలోనే రాయచోటిలొ ఇసుక దం దా...నడుస్తుందని ఆరోపణలు చేశారు సోము వీర్రాజు. బద్వేలు నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశా రు సోము వీర్రాజు.
Latest News