by సూర్య | Mon, Oct 25, 2021, 07:57 PM
కడప జిల్లాలోని గొరిగనూరు గ్రామంలో దారుణ హత్యకు పాల్పడ్డారు. వరాలు (35) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మద్యం సీసాతో గొంతులో పొడిచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొరిగ నూరు ఎస్సీ కాలనీకి చెందిన ఉపేంద్ర అనే వ్యక్తి చంపినట్లు మృతుని బంధువులు అనుమానిస్తున్నారు. మృతుడు జమ్మలమడుగు బి.సి కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Latest News