by సూర్య | Mon, Oct 25, 2021, 06:04 PM
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాయలసీమకు చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన కాలంలో బాబు.. ఒక్క ప్రాజెక్ట్ అయినా.. కట్టారా? అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం వెలిగొండను పూర్తిచేయనుందని అన్నారు.
తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రామోజీకి కనిపించడంలేదా అని ఎద్దేవా చేశారు. కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి బాబు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అదే విధంగా.. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయా? అని మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఏపీలో ప్రతి పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు.
తెలంగాణ స్కూళ్లకు వెళ్దాం.. ఏపీ స్కూళ్లకు వెళ్దాం.. ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూడండని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. తమ ప్రభుత్వం ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ సంక్షేమం చూసి తాము.. నేర్చుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Latest News