by సూర్య | Mon, Oct 25, 2021, 04:23 PM
విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. నిన్న రాత్రి రాజగోపాలచారి వీధిలోని ఘర్ సన్సార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. రాత్రి సమయం కావడంతో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఫిష్ ట్యాంకులు, ఆక్వేరియంలో ఉన్న చేపలు మొత్తం చనిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.ఇదిలా ఉంటే ఫైర్ సేఫ్టీ అక్విప్మెంట్ లేకపోవడంతోనే ప్రమాదం తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. దశాబ్ద కాలంగా ఉన్న ఘర్ సన్సార్ ఫైర్ సేఫ్టీ చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
Latest News