by సూర్య | Mon, Oct 25, 2021, 03:52 PM
గుంటూరు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉర్దూ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడొకరు విద్యార్థినులపై దారుణానికి తెగబడ్డాడు. తాను వినియోగించే స్మార్ట్ఫోన్లో అశ్లీల వీడియోలు, ఫొటోలను విద్యార్థినులకు చూపిస్తూ, వారిని వేధింపులకు గురి చేస్తోన్నాడు. ఈ విషయం తెలియడంతో తల్లిదండ్రులు, స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఆ కీచక టీచర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
జిల్లాలోని సత్తెనపల్లి టౌన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక 17వ వార్డులో కొంతకాలంగా ప్రభుత్వ ఉర్దూ పాఠశాల నడుస్తోంది. అందులో పలువురు విద్యార్థులు చదువుకుంటున్నారు. చిరు వ్యాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు, అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు వారంతా. 17. 18 వార్డులకు చెందిన పలువురు స్థానికులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించారు. ఒకే కాంపౌండ్లో ఉన్న ఈ పాఠశాలలో తెలుగు, ఉర్దూ మీడియంలల్లో విద్యాబోధన సాగుతోంది.
ఉర్దూ మీడియం పాఠశాలలో పని చేసే కొమ్మెరపూడికి చెందిన హుస్సేన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపై కొంతకాలంగా ఘాతుకానికి పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 4, 5వ తరగతుల్లో చదువుకునే విద్యార్థినులకు తన స్మార్ట్ఫోన్ ద్వారా అశ్లీల వీడియోలను చూపిస్తున్నాడని, వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రోజువారీ వ్యవసాయ కూలీ పనులను చేసుకునే తాము.. ఉపాధ్యాయుల మీద నమ్మకంతో తమ పిల్లలను పాఠశాలలో వదిలి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News