ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా: చంద్రబాబు

by సూర్య | Mon, Oct 25, 2021, 03:22 PM

ఏపీలో మద్యపాన నిషేధమని చెప్పి జగన్‌రెడ్డి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం మాఫియా నడుస్తోందని ఆరోపించారు. డ్రగ్స్‌తో యువత నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ చేయమని అడిగితే ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.


జగన్ గత రెండేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు. చివరికి పార్లమెంట్ సభ్యుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Latest News

 
పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు Fri, Mar 29, 2024, 07:54 PM
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు Fri, Mar 29, 2024, 07:51 PM
నారా లోకేశ్ కాన్వాయ్‌లో రూ.8 కోట్ల క్యాష్ దొరికిందా..? వైరల్ అవుతోన్న వీడియోలో నిజమెంత. Fri, Mar 29, 2024, 07:48 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఒక్క రోజు దర్శన సమయం మార్పు Fri, Mar 29, 2024, 07:44 PM
తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన అలర్ట్.. అటు వైపు వెళ్లొద్దని హెచ్చరిక Fri, Mar 29, 2024, 07:39 PM