పీలో చం‍ద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారు: ఎంపీ భరత్‌

by సూర్య | Mon, Oct 25, 2021, 03:08 PM

 ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కొత్తగా బూతు రాజకీయాలు తెచ్చారని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా పట్టాభి తో చంద్రబాబు మాట్లాడించారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్‌ మాట్లాడుతూ.. 'మీ తిట్లను సమర్థించుకోవడానికి ఢిల్లీకి వెళ్లారా అని బాబు?, పట్టాభి వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించకపోవడానికి కారణం ఏమిటి?


బాబు అధికారంలో లేకపోతే రాష్ట్ర పరువును తీస్తారా?, రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని బిరుదు ఇస్తున్నాడు... రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తోంది. నీ 36 గంటల దీక్ష ఎందుకు చేశావ్...? మా వాడు మాట్లాడింది తప్పు అని ఒక్క మాట మాట్లాడావా...?, నువ్వు చెప్పుకునే హుందా రాజకీయాలు ఎక్కడికెళ్ళాయి..?, ఢిల్లీలో వెళ్లి పెద్దలను కలిసిన చం‍ద్రబాబు ఏమని పలకరించారు. చం‍ద్రబాబు స్వప్రయోజనాలకే ఢిల్లీ వెళ్లినట్లుంది' అని ఎంపీ భరత్‌ విమర్శించారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM