విశాఖలో జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌

by సూర్య | Sun, Oct 24, 2021, 09:30 PM

టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ సందర్భంగా బెట్టింగ్‌ జరుగుతున్న కేంద్రంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు దాడులు నిర్వహించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నగదు, ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. టీ20 ప్రపంచ కప్‌ క్రికెట్‌ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ నేపథ్యంలో భారీ బెట్టింగ్‌లకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆదివారం ఉదయం ఎస్‌ఈబీకి సమాచారం అందింది. ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఏఈఎస్‌ బి.శ్రీనాథుడు, సిబ్బందితో కలిసి మాధవధారలోని ఒక అపార్ట్‌మెంటులో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న లాలం ప్రభాకర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రూ.88,088 నగదు, ల్యాప్‌టాప్‌, రెండ్‌ సెల్‌ ఫోన్లు, రెండు చెక్‌ బుక్‌లు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM