by సూర్య | Sun, Oct 24, 2021, 10:57 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ నేత పట్టాభి అరెస్టయిన విషయం అందరికీ తెలసిందే. అయితే ఆయన శనివారం బెయిల్పై విడదల అయ్యారు. అనంతరం ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ బయల్దేరారు. ఆయన ఇప్పటి వరకు ఇంటికి చేరలేదు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది.. పట్టాభి మా కస్టడీలో లేడని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో పట్టాభి ఎక్కడి వెళ్లాడని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీపై అనుచిత వాఖ్యల కారణంగా ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మచిలీపట్నం జిల్లా జైలుకు తరలించారు. అనంతరం విజయవాడ కోర్టులో హజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
Latest News