మహిళా పక్షపాతి జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదు:వాసిరెడ్డి పద్మ

by సూర్య | Sat, Oct 23, 2021, 02:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆడవారిని తిట్టే స్థాయికి రాజకీయాలు దిగజారాయని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. మహిళా హోంమంత్రిని కూడా తిడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వాసిరెడ్డి పద్మ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఏపీలో మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా అన్నారు.


ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పదవులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చారని పద్మ కొనియాడారు. మహిళా పక్షపాతి అయిన వైయస్ జగన్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. మహిళలకు వైయస్ జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాక, మహిళల్లో ఎంతో మార్పు వస్తోందని… ప్రతిపక్షాలు ఇకనైనా మారాలని పద్మ చెప్పుకొచ్చారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తుండటాన్ని అన్ని పార్టీలు ఆహ్వానించాలని, అలా చేయకుండా విమర్శలు గుప్పిస్తుండటం దారుణమని అన్నారు. మహిళా హోంమంత్రిని కూడా కించపరుస్తూ మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. ఇది ముమ్మాటికీ దళితులపై జరుగుతున్న దాడేనని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Latest News

 
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM
ఉపాధ్యాయులకు సన్మానం Tue, Apr 23, 2024, 12:51 PM
టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన గుంటపల్లి హైస్కూల్ Tue, Apr 23, 2024, 12:37 PM
మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ Tue, Apr 23, 2024, 12:36 PM