టీడీపీ ముఖ్యనేతలతో భేటీకానున్న చంద్రబాబు

by సూర్య | Sat, Oct 23, 2021, 01:01 PM

ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలపై చంద్రబాబు ఢిల్లీ బాట పట్టనున్నారు. అక్కడ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడే జరిగే భేటీలో రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 అమలు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ పర్యటన అజెండాపై చంద్రబాబు.. శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తోపాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు.ఢిల్లీ పర్యటన అజెండాపై నేతలతో చంద్రబాబు చర్చించారు. ఈ నెల 25న రాష్ట్రపతితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 అమలు చేయాలని కోరనున్నారు. అయితే ఢిల్లీ పర్యటన సమయంలో అనుసరించాల్సిన అజెండాపై పార్టీ ముఖ్యనేతలు సూచనలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు, నేతలు.. రాష్ట్రపతితో పాటు ఇంకా ఎవరెవరిని కలవాలి అనే దానిపై నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది.


 


 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM