పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దీక్ష : మంత్రి కన్నబాబు

by సూర్య | Sat, Oct 23, 2021, 12:56 PM

'చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేశారు. అసలు దీక్ష ఎందుకు చేశానా అని టీడీపీ అధ్యక్షుడికే డౌట్‌ వచ్చింది. ఢిల్లీ వెళ్లే టీడీపీ నేతలు రాష్ట్రపతిని ఏమని సంబోధిస్తారు'' అని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మాట్లాడారు. ''పార్టీ ఉందని నిరూపించుకోవడం కోసమే చంద్రబాబు దీక్ష డ్రామాలు చేస్తున్నారు. ఆయన దీక్షలపై డిక్షనరీ రాయాలి. చంద్రబాబు దీక్షపై టీడీపీ నేతలకే క్లారిటీ లేదు. చంద్రబాబు అమిత్‌ షా మీద రాళ్లు వేయించారు.. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు'' అన్ని కన్నబాబు ప్రశ్నించారు.సీఎం జగన్‌ ని సంభోదించిన పదంతోనే మీరు రాష్ట్రపతిని సంభోదించగలరా.. లోకేష్‌ కూడా చంద్రబాబును ఆ పదంతో పిలుస్తారా. అసలు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏం చెబుతారు. మేం బూతులు తిడితే వైఎస్‌ఆర్‌సీపీకి ఆగ్రహం వచ్చిందని చెబుతారా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నది మీరు కాదా'' అని కన్నబాబు ప్రశ్నించారు.


 


 

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM