నేడు ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల

by సూర్య | Sat, Oct 23, 2021, 09:21 AM

ఇంటర్మీడియెట్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బో ర్డు ఇన్‌చార్జ్జ్‌ కార్యదర్శి వి. రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది.


వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రామకృష్ణ పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు 'https:bie.ap.gov.in ' ద్వారా తమ షార్ట్‌ మార్కుల మెమోలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ' ourbieap@gmail.com '' ద్వారా లేదా 9391282578 వాట్సాప్‌ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.


 


28 నుంచి 30 వరకు సీపీటీ టెస్టు


సాక్షి, అమరావతి: వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కారుణ్య నియామక గ్రేడ్‌-2 వీఆర్వోలు తదితరులకు కంప్యూటర్‌ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ) ఈనెల 28వ తేదీనుంచి 30వ తేదీ వరకు జరుగుతుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్‌ టికెట్లను ' https://psc.ap. gov.in' నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.


 


ఈ వెబ్‌సైట్‌లలో ఫలితాలు..

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM