by సూర్య | Fri, Oct 22, 2021, 10:15 PM
దసరా సెలవుల్లో కొందరు నిర్వాహకులు జిల్లాలోని పాఠశాలల్లో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కొత్తూరు ఎంపీపీ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాఠశాలలో నగ్నంగా, అశ్లీల నృత్యాలు చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో మందు, హిజ్రాలతో నిర్వాహకులు చిందులు వేసారు. దసరా సెలవుల్లో రికార్డింగ్ డ్యాన్స్ల బ్యాచ్ హంగామా నెలకొంది. ఏకంగా తరగతి గదిలో హిజ్రాలతో కలిసి నిర్వాహకులు మద్యం తాగారు. విద్యార్థులు చదువుకునే తరగతి గదిలో దుశ్చర్యలపై గ్రామంలో దుమారం రేగింది.
ఈ నెల 11వ తేదీన అమ్మవారి ఊరేగింపు తర్వాత స్కూల్లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ట్రాక్టర్, ఫోన్లు, డీజే బాక్సులను పోలీసులు సీజ్ చేసారు.
Latest News