by సూర్య | Fri, Oct 22, 2021, 10:11 PM
టీడీపీ అధినేత చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు అయింది. ఏపీలో ఆర్టికల్ 356 అమలుచేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. సోమవారం ఢిల్లీకి చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలవనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు అయింది.
Latest News