by సూర్య | Sun, Jun 13, 2021, 01:35 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీనిని ఫోటో తీసి వాట్సఫ్ గ్రూపులో పోస్టు పెడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా..దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News