నవరత్నాల పేరుతో నవరత్న ఆయిల్ రాశారు: కొల్లురవీంద్ర

by సూర్య | Sat, Jun 12, 2021, 04:05 PM

ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల పేరుతో ప్రజలకు నవరత్న ఆయిల్ రాశాకరి మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పన్నుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలపై అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని... మరి ఇప్పుడు ఎలా పెంచారని ప్రశ్నించారు. రాష్ట్ర వాటా తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గించుకోవచ్చు కదా అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలించారని వారికి పన్నుల బాదుడు బహుమతిగా ఇస్తున్నారా అని నిలదీశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి పన్నులు 15 శాతామేగా పెంచుతున్నామని చెబుతున్నారని... 15 శాతం అంటే మీకు తక్కువగా కనిపిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల పేరుతో ప్రజలకు ఎరా వేసి పన్నుల పేరుతో లూటీ చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి పేర్ని నాని పన్నులు పెంచడం లేదని అంటున్నారని... మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో తమ పుత్రరత్నం సమీక్షలు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.


మచిలీపట్నంలో వైసీపీ నాయకులు షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం కోసం మచిలీపట్నం నుంచి కార్యకర్తలను తరలించడం వల్ల బందరులో కరోనా కేసులు పెరిగాయన్నారు. మంత్రి పేర్ని నాని వల్లే మచిలీపట్నంలో చాలామంది కరోనాతో చనిపోయారని ఆరోపించారు. మచిలీపట్నం ప్రభుత్వం హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక ఒక్క గంటలో 6 మంది చనిపోయారని తెలిపారు. షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు మంగలేరులో మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు. బందరులో డ్రైనేజీలో మురుగు తీస్తున్నారని.. ఆ పనులకు టెండర్లు పిలిచారా అని ప్రశ్నించారు. ''మంత్రి గారి కుమారుడు సచివాలయం ప్రారంభించడం ఏంటి?.. అది ప్రభుత్వ కార్యాలయమా?... వైసీపీ కార్యాలయమా?'' అని అడిగారు. కేంద్రం ఇచ్చే అప్పు కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడ్డారు.పెంచిన పన్నులను రద్దు చేయాలని.. లేనిపక్షంలో ప్రజలను కలుపుకుని ఉద్యమం చేస్తామని కొల్లురవీంద్ర హెచ్చరించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM