by సూర్య | Sat, Jun 12, 2021, 02:33 PM
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవలో దారుణం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిని మేనమామ గొంతు కోసి హత్య చేశాడు. గత అర్ధరాత్రి మూడేళ్ల చిన్నారి కిల్లక భవ్యశ్రీ నిద్రిస్తున్న సమయంలో మేనమామ వినోద్ కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. మతి స్థిమితం సరిగా లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిందితుడు వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News