by సూర్య | Sat, Jun 12, 2021, 01:07 PM
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో భక్తులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. కేశకండనశాల వద్ద క్యూ లైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. కనీసం భౌతికదూరం పాటించకుండా కరోనా నిబంధనలకు తూట్లు పొడిచారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆలయ అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో పలువురు భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Latest News