భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ

by సూర్య | Sat, Jun 12, 2021, 12:35 PM

తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు మరింత సులభతరం చేసింది టీటీడీ. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ, ఎంబీసీ వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలను నెలకొల్పారు. ఇక ఈ కేంద్రాలను శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సులువుగా అద్దె గదులు పొందవచ్చని తెలిపారు.


ఆరు కౌంటర్లలో ఎక్కడైన గదులు బుక్ చేసుకోవచ్చని వివరించారు. ప్రస్తుతం గదులు కేటాయించే సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండటం, వాహనాల పార్కింగ్ సమస్యలు తలెత్తుతుండటంతో వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మారెడ్డి. ఆన్లైన్లో వసతి గదులు బుక్ చేసుకున్న భక్తులు నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గది కేటాయించిన సమాచారం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సందేశం రూపంలో పంపుతారని వివరించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM