by సూర్య | Sat, Jun 12, 2021, 10:57 AM
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మర్రిపాడు మండలం బుదవాడ గ్రామ శివారులో చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన కూలీలు జామాయిల్ కర్రలు కొట్టెందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పలువురి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులు కడప జిల్లా గోపవరం మండలం బెడుసునపల్లె వాసులుగా గుర్తించారు. నందిపాడుకి వెళ్లి జామాయిల్ కర్రలు కొట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కడప జిల్లా బెడుసునపల్లెలో విషాదం నెలకొంది.
Latest News