by సూర్య | Fri, Jun 11, 2021, 12:52 PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్ర సివిల్ సప్లైకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్ను కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు.
Latest News