by సూర్య | Fri, Jun 11, 2021, 12:06 PM
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ వేళల్లో పలు మార్పులు చేసింది ఏపీ సర్కార్. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ ఆంక్షలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చింది. గతంలో ఈ సమయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండగా.. ఇప్పుడు సడలింపు సమయాన్ని మరో రెండు గంటల పాటు పెంచింది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. ప్రజలు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని జగన్ సర్కార్ హెచ్చరించింది.
Latest News