ఏపీలో కొత్తగా 8,110 కరోనా కేసులు

by సూర్య | Thu, Jun 10, 2021, 05:08 PM

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ లో 97,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,110 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,763 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 12,981 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 77 వేల 063 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 99,057 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,01,37,627 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు వివరాలు.. శ్రీకాకుళం- 461, విజయనగరం- 280, విశాఖ- 502 ,తూ.గో- 1,980, ప.గో- 837, కృష్ణా- 339, గుంటూరు- 520, ప్రకాశం- 711, నెల్లూరు- 391, చిత్తూరు- 974,వ అనంతపురం- 960, కర్నూలు- 338, వైఎస్ఆర్ జిల్లా- 582 కేసులు నమోదయ్యాయి.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM