పన్నులు పెంచడమే ధ్యేయంగా వైసీపీ పాలన: ఆలపాటి

by సూర్య | Wed, Jun 09, 2021, 01:10 PM

గుంటూరు: ఏపీలో పన్నులు విధింపుపై హక్కులను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. పన్నులు పెంచడమే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోందని విమర్శించారు. సంపద పెంచుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఆస్తి విలువపై పన్ను విధింపు ఇప్పుడే చూస్తున్నామని తెలిపారు. చెత్త మీద పన్ను విధింపు గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు. సామాన్యుడు బ్రతికే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యే లు ఉన్నారనే నిరంకుశంగా పాలన సాగిస్తున్నారన్నారు. తక్షణమే 197,198 జీఓలను రద్దు చేయాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM