by సూర్య | Wed, Jun 09, 2021, 08:57 AM
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం 11302 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.87 లక్షలు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. 3710 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆకాశగంగలో హనుమంతుడికి ఇకపై నిత్యపూజలకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలకమండలి గడువు 21న ముగియనుంది. రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Latest News